132- జీడిమెట్ల డివిజన్ వెన్నెలగడ్డ లో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ఎండి శ్రీనివాస్ సాధు, మేనేజింగ్ ట్రస్టీ కె. రఘురామన్ సహాయ సహకారాలతో దాదాపు 3.00 కోట్ల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తును నిర్మించడంలో గురువులు, పాఠశాలలో సదుపాయాలు ఎంతో ముఖ్యమని, పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హరిశ్చంద్ర, పాఠశాల హెడ్ మాస్టర్ శిరీష, ఎంఆర్ పి రమేష్, నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, ఎల్లా గౌడ్, నరేందర్ రెడ్డి, నర్సింహా, బీరప్ప, యేసు, బాల మల్లేష్, సిద్ధిక్, విజయ్ హరీష్, నదీమ్ రాయ్, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.