ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను ఆ మాట అన్నందుకే కేసులు పెట్టారు: దివ్వెల మాధురి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 10:37 PM

ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఎపిసోడ్ చర్చనీయాంశమైంది. ఈ జంట తిరుమల శ్రీవారి దర్శనం వివాదాస్పదమైంది. కొండపై శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవరించారని కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై శ్రీనివాస్, మాధురిలు స్పందించారు. తిరుమలలో తాము ఎలాంటి రీల్స్ చేయలేదు, ఫోటోలు దిగలేదన్నారు మాధురి. తాము దిగిన ఒక్కఫొటో అయినా ఉందా?.. అసలు తాము ఫొటోగ్రాపర్స్‌ని తీసుకువెళ్లలేదన్నారు. కొంతమందిని వద్దని వారిస్తున్నా.. తన వెంటపడి వీడియోలు, ఫొటోలు తీశారన్నారు. ఈ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు.


తాము కార్యకర్తలతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లామని.. 7,8,9 తేదీల్లో తమపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు మాధురి. తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ నెల 10న కేసు నమోదు చేశారన్నారు. తమపై రాజకీయ కుట్రలో భాగంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. మొన్నటి వరకు తిరుమల లడ్డూ ప్రసాదం.. ఇప్పుడు మాధురి తిరుమలలో తిరిగిందంటున్నారని.. దయచేసి దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. కొండమీద వ్యక్తిగతమైన, రాజకీయాలు మాట్లాడకూడదని తెలియదని.. అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు.


తాను గతంలో తిరుమల మాడ వీధుల్లో తిరగానని.. నాట్యం చేశానన్నారు మాధురి. తిరుమలలో తనపై నమోదైన కేసుల్ని న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. తనది, శ్రీనివాస్‌ది అపవిత్ర బంధం కాదు.. పవిత్రబంధంగా చెప్పుకొచ్చారు మాధురి. తాము విడాకులు తీసుకున్న కలసి ఉంటామని.. దువ్వాడ శ్రీనివాస్‌పై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరూ ఏం చేయలేరన్నారు. ఆయన టెక్కలిలో ఇండిపెండెంట్‌గా పోటీచేసినా గెలుస్తారని.. దువ్వాడ శ్రీనివాస్‌ను ఎదురించే వారు ఎవరూ లేరన్నారు.


తిరుమల విషయంలో తమను రాజకీయంగా ఇబ్బందిపెట్టాలని భావించారన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తిరుమల కొండపై ఎలాంటి తప్పు, అపచారం చేయలేదని.. నాలుగు రోజుల తర్వాత కేసులు పెట్టడం దారుణమన్నారు. తమ వ్యక్తిగత అంశాలను పార్టీ పట్టించుకోదని.. పార్టీకి ఈ విషయాలను తానే చెప్పానన్నారు. ఒకవేళ వైఎస్సార్‌సీపీ తనను సస్పెండ్ చేసినా పర్లేదని.. పార్టీకి వ్యక్తిగత అంశాలను ముడిపెట్టకూడదన్నారు. తమలాంటి వారు తిరుమల కొండకు దర్శనానికి వెళ్లే అవకాశం ఉందో లేదో టీటీడీ చెప్పాలన్నారు.


తిరు మాడవీధుల్లో దివ్వెల మాధురి ఫోటో షూట్లు


తిరుమలలో కేసుల్ని కోర్టులలో ఎదుర్కొంటామన్నారు దువ్వాడ. హిందూ ధర్మం గురించి మాట్లాడే శక్తి తనకు లేదని.. సాంప్రదాయంలో బహు భార్యత్వం కూడా ఉందన్నారు. తన భార్య వాణికి ఆస్తులు రాసేశాను.. పిల్లలకు అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. తాను చేసింది తప్పు అని తెలిసినా.. తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చిందన్నారు. తన మనసులో ఏం ఉందో అది బయటకు చెబుతానని.. ప్రజా జీవితాన్ని మళ్లీ మొదటపెడతానన్నారు. తాను పడిపోయిన దగ్గర నుంచి లేస్తానని.. ఇంట, రచ్చ రెండు చోట్ల ఓడిపోయాన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com