నారాయణపేట పట్టణ శివారులోని డంపింగ్ యార్డుకు మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ మాయంక్ మిత్తల్ తో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డుకు తడి, పొడి చెత్త నిర్వహణను పర్యవేక్షించారు. వ్యర్థాలతో తయారు చేస్తున్న ఆయిల్, ఇటుక లను పరిశీలించారు. పట్టణం నుండి ప్రతి రోజు సేకరిస్తున్న చెత్త వివరాలను మున్సిపల్ కమిషనర్ సునీత ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆవరణలో మొక్కలను నాటరు.