నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అశోక్ కుమార్ కోరారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ. గత ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని, 58 ఏళ్ళు నిండిన నాయి బ్రాహ్మణులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు.