దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన బొక్క బుచ్చన్న హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో లంగ్స్ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నాడు. అతడికి అపరేషన్ నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా రూ. 2, 50, 000 మంజూరు కాగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మంగళవారం బుచ్చన్న కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.