ఆర్టీసీ బస్సు, టీవీఎస్ ఎక్సెల్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. బిబిపేట్ మండలం తుజాల్పూర్ లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన గరిగంటి లక్ష్మయ్య(65) వ్యవసాయ పనుల నిమిత్తం టీవీఎస్ ఎక్సెల్ పై ఆకారం రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన దుబ్బాక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో లక్ష్మయ్యకు గాయాలు కాగా కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.