జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం చిన్నంగుల గడ్డ తండాలో నూతన హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తండావాసులు పాల్గొన్నారు.