ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదైన ఘటన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతిని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.