కామారెడ్డి జిల్లా పిట్లం మండలం హస్నాపూర్ గ్రామంలో గురువారం బిజెపి పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ బిజెపి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ కు ఓటు వేసి గెలిపించాలని బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మంచి శశిధర్ గుప్తా, నాయకులు పాల్గొన్నారు.