కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి మల్లారెడ్డి నగర్ నుండి మహాదేవపురం వెళుతున్న లక్ష్మణ్ అనే ఇంటర్ విద్యార్థిని గుర్తుతెలియని బస్సు గురువారం ఢీ కొట్టడం జరిగింది. విద్యార్థి కింద పడిపోవడంతో తలపై నుండి బస్సు టైర్ వెళ్లగా విద్యార్థుల లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు.