అభివృద్ధి పనుల్లో ప్రజలు సహకరించాలని అత్తాపూర్ కార్పొరేటర్ మోండ్ర సంగీతాగౌరీశంకర్ అన్నారు. కాంతారెడ్డినగర్ కాలనీలో 12 లక్షలతో సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఎన్నో రోజుల నుంచి అటు అంబియన్స్ ఫోర్బ్స్ ఇటు కాంతారెడ్డినగర్ కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని సూచించామన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతాప్రమాదాలతో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అర్బన్ జిల్లా కార్యదర్శి మోండ్ర కొమురయ్య, సీనియర్ జర్నలిస్ట్ మ్యాడం మధు, బిల్డర్ రామ్ రెడ్డి , గోవిందొడ్డి, మ్యాడం రామేశ్వరరావు, బీట్కూరి సిద్ధేశ్వర్, వెంకటేష్, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ వీరారెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.