ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాహేబ్ నగర్ త్రినేత్ర ఆంజనేయ స్వామి జాతర ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్పొరేటర్ ను శాలువాతో సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలొ ఆలయ ఈఓ ప్రవీణ్ కుమార్, సభ్యులు ఉమేష్ గౌడ్, రాజశేఖర్ గౌడ్, దేవేందర్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.