వనపర్తి జిల్లా శ్రీరంగాపురం తాటిపాములలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను అకాల మృత్యువు కబళించింది. బట్టలు ఉతకడానికి వెళ్లి ముగ్గురు తోబుట్టువులు ఒకరి తర్వాత ఒకరుగా నీళ్లలో మునిగి చనిపోయారు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తిరుపతమ్మ (14), సంధ్య (12), దీపిక (10) బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు.
ఇద్దరు అక్కలు బట్టలు ఉతుకుతుండగా.. దీపిక ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయింది. అది గమనించిన అక్కలు తిరుపతమ్మ, సంధ్య చెల్లిని కాపాడేందు చెరువులోకి దిగారు. ముగ్గురికి ఈత రాకపోవటంతో నీళ్లల్లో మునిగి చనిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురూ చెరువులో మునిగి చనిపోవటంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.