ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన్స్ నుండి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కో ఆర్డినేటర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ లో జరుగు యువ సంఘర్షణ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ పటేల్ విచ్చేసి జెండా ఊపి ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడాకుల అశోక్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటానికి మద్దతుగా తెలంగాణ యువతకు, మలిదశ తెలంగాణ పోరాట వీరులకు, అమరవీరుల కుటుంబాలకు అండగా నేనున్నానని కదిలి వస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఘన స్వాగతం పలుకుతూ నిరుద్యోగులారా, మలిదశ తెలంగాణ పోరాట యోధులారా అమరవీరుల కుటుంబ సభ్యులారా ఆలోచించండని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1200 మంది విద్యార్థుల బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. చదివిన చదువులకు కొలువులు రాక విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నారు. అంగడిలోసరుకుల మాదిరిగా ప్రశ్నాపత్రాల అమ్ముకుంటున్నది ఈ ప్రభుత్వం. చోద్యం చూస్తూ నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులు మోసగిస్తుంది. అక్కడ మోడీ ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇక్కడ కేసీఆర్ ప్రతీ యేటా రెండు లక్షల ఉద్యోగాల పేరు మీద చేస్తున్న మోసాలను నిలదీసిఅడిగేందుకు, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకానికి భరోసా కల్పించేందుకు సోమవారం సాయంత్రం విచ్చేయుచున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు అమలు చేయు పథకాలు, యువ డిక్లరేషన్ ప్రకటించుటకై యువ విద్యార్థి లోకం కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండలనాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళ నాయకురాళ్లు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.