హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో రైలు సర్వీసు వేళలను పొడిగిస్తున్నట్లుహైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 10వ తేదీ నుంచి రైలు సర్వీసు వేళల్లో మార్పులు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆ రోజు నుంచి రాత్రి 11 గంటలకు చివరి రైలు బయలుదేరుతుందని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.