ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 04:56 PM

స్వచ్ సర్వేక్షన్ అవార్డు గెలుపొందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చే అభినందనలు పొందిన ఘట్కేసర్ ఘట్కేసర్ మునిసిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ను అదేవిధంగా పాలకవర్గన్ని అభినందించి మున్సిపాలిటీ శానిటేషన్ కొరకు 2 కోట్ల నిధులను మంజూరు చేసిన కేటీఆర్ ,

ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, * అదేవిధంగా మంత్రి చామకూర మాల్లారెడ్డి , శానిటేషన్ కొరకు 2 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు గాను ఘట్కేసర్ మున్సిపాలిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ. ఘట్కేసర్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల కష్టానికి ప్రతి ఫలమే ఈ నగదు బహుమతి అని మనం ఎంత కష్టపడిన వారు కష్టపడి పని చేసి ఘట్కేసర్ మున్సిపాలిటీ ని ఎంతో శుభ్రంగా గా ఉండటానికి రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని తెలిపారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఇలాగే పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తు చేసుకొని చెత్తను చెత్త బుట్టలో వేసుకొని చెత్త సేకరణ వాహనం వచ్చిన తర్వాత వాహనంలో వేయాలని కోరారు. పాలకవర్గం అదేవిధంగా ప్రజల అందరి సహకారంతో ఇలాంటి అవార్డు లు, నగదు బహుమతులు మన మున్సిపాలిటీ తీసుకురావడానికి ఎల్లవేళలా కృషి చేస్తానాని తెలుపుతూ మరొకసారి పాలకవర్గనికి ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com