యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నుండి రాబోతున్న కొత్త చిత్రం విక్రమ్. కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. సూర్య పాత్రపై చిత్రబృందం సైలెంట్ గా ఉంటూ ఉత్కంఠను కలిగిస్తుంది. రీసెంట్ గా జరిగిన విక్రమ్ ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఫ్రెండ్షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఆయన మాట్లాడుతూ విక్రమ్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ రావలసి ఉందని, బలమైన కారణంతోనే ఈ కార్యక్రమానికి రజిని రాలేకపోయారని, ఆ విషయం తనకు రజిని ఫోన్ చేసి చెప్పారని, విక్రమ్ మూవీ విజయం సాధించాలని రజిని కోరుకున్నారని కమల్ తెలిపారు. వృత్తిపరంగా, రాజకీయపరంగా ఇద్దరి మధ్య విభేదాలున్నప్పటికీ, అవేవి తమ స్నేహానికి అడ్డుకావని, అవరోధంగా ఉండబోవని కమల్ చెప్పారు. ఈ సినిమాను జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసారు.