రాజశేఖర్ హీరోగానటించిన సినిమా 'శేఖర్'. ఈ సినిమా మే 20న విడుదలైంది. మలయాళ సినిమా 'జోసెఫ్'కు రీమేక్గా ఇది తెలుగులో తెరకెక్కింది. అయితే ఈ చిత్ర యూనిట్కి కోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమాని నిలిపివేయాలని పెట్టాలని ఆదేశించింది.దీంతో సినిమాను థియేటర్లలో ప్రదర్శించకుండా నిలిపివేశారు. ఈ అంశంపై హీరో రాజశేఖర్ ట్విట్టర్లో స్పందించారు. చాలా కష్టపడి సినిమా తీశాం అన్నారు. అయితే కొందరు కుట్ర వల్లే సినిమా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.‘శేఖర్’ చిత్రాన్ని నిర్మించిన జీవిత రాజశేఖర్పై ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు.తన దగ్గర రూ.65 లక్షలు అప్పుగా జీవిత తీసుకున్నారని, సినిమా పూర్తైనా ఆ మొత్తం చెల్లించలేదని కోర్టుకు తెలిపారు.దీంతో ఆదివారం సాయంత్రం 4.30 గంటల లోపు పరంధామరెడ్డికి రూ.65 లక్షలు చెల్లించాలని జీవితకు నోటీసులు అందజేసింది. అయితే చెల్లింపులు జరగకపోవడంతో సినిమాను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.