అమరావతి : రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులో ఎన్టీఆర్ టెన్నిస్ కప్ పోటీలను మంత్రి ప్రత్తిపాటి పారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.