కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమేథీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన సొంత నియోజకవర్గమైన అమేథీలో తొలి సారి పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోనికి రాగానే అమేథీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు.