తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : టిటిడి 970.080 కిలోల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట్ చేసింది. 2016, మార్చిలో తొలుత టిటిడి ఈ బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డిపాజిట్ చేసింది. కాల పరిమితి పూర్తి కావడంతో వడ్డీ రూపంలో వచ్చిన బంగారాన్ని కలిపి తిరిగి అదే బ్యాంకులో గోల్డ్ మానిటైజేషన్ పథకంలో 1 శాతం వడ్డీతో 3 సంవత్సరాల కాలానికి స్వల్పకాలిక డిపాజిట్ చేసింది. ఎస్బిఐ ఎండి రజనీష్కుమార్ ఈ మేరకు టిటిడి బంగారం డిపా జిట్ చేసిన పత్రాలను ఇఓ సాంబశివరావుకు అంద జేశారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం లో గల ఇఓ కార్యాలయంలో శనివారం సాయం్త్రం ఈ కార్యక్రమం జరిగింది. కాగా శ్రీవారి హుండీ కానుకల రూపంలో అందిన మిక్స్డ్ కేటగిరి బంగారు నగలు, వస్తువులు కలిపి దాదాపు 1400 కిలోలను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 1.25 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసిన విషయం విదితమే. దీనిని మూడు సంవత్సరాల కాలపరిమితికి గోల్డ్ మానిటైజేషన్ పథకంలో స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ కేటగిరిలో డిపాజిట్ చేసింది. అదే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1311 కిలోల 0.995 స్వచ్ఛత గల బంగారు కడ్డీలను 1.75 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసింది. దీన్ని మూడు సంవత్స రాల కాలపరిమితికి గోల్డ్ మానిటైజేషన్ పథకంలో స్వల్పకాలిక బ్యాంక్ డిపా జిట్ కేటగిరిలో డిపాజిట్ చేసింది. స్వచ్ఛమైన బంగారం కేటగిరిలో ఈ బ్యాంకు చెలి ్లస్తున్న వడ్డీ ఇదే అత్యధికం.