ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేధోసంపత్తి, వాణిజ్య, అభివృద్ధిపై చట్టాల అంతర్జాతీయ ముగింపు సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 01:22 AM

  విజయవాడ, సూర్య బ్యూరో : ప్రపంచంలోనే పేరెన్నికగన్న దేశాలలో ఉన్న ఆర్బిట్రేషన్‌ కంటె, ముఖ్యంగా సింగపూర్‌ లాంటి దేశాల కన్నా భారతదేశమే ఆర్బిట్రేషన్లో కంపెనీలకు, వ్యక్తులకు అనుకూలంగా ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ మదన్‌ బి. లోకూర్‌ తెలిపారు. శనివారం నగరంలో మేథోసంపత్తి, వాణిజ్య, అభివద్ధి చెందుతున్న చట్టాలు అంతర్జాతీయ ముగింపు సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ మదన్‌ బి.లోకూర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో ఆయన మాట్లాడుతూ సివిల్‌ కేసుల పరిష్కారంలో ఆర్బిట్రేటర్‌ ముఖ్య ప్త్రా వహిస్తున్నారన్నారు. వలస చట్టాలకు సంబంధించి, కంపెనీల ఆగ్రీమెంట్లకు సంబంధించి సింగపూర్‌ లాంటి దేశంలో రోజుకు ఒక్కో కేసుకు లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారన్నారు. భారతదేశంలో ఆర్బిట్రేటరు తక్కువ ఖర్చుతోనే తమ సేవలు కేసుల పరిష్కారంలో అందిస్తున్నారని తెలిపారు. తక్కువ సమయంలోనే కేసుల పరిష్కారంలో ఆర్బిట్రేటర్‌ ప్రముఖంగా ఉండారన్నారు. మధ్యవర్తిత్వంలో ఆర్బిట్రేటర్‌ కేసుల పరిష్కారంలో గణనీయమైన ప్త్రా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వలస చట్టాల మీద ఆధారపడే కన్నా, మనకంటూ భారతదేశానికి చట్టాల విషయంలో స్వీయ విధానం అభివద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్రొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్నానాన్ని అమలుల్లోకి తేవడం వల్ల త్వరగా కేసుల పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ జి.రోహిణి మాట్లాడుతూ వివాహా సంబంధాలపై సవివరంగా తెలియజేశారు. ఇప్పటివరకు వర్క్‌షాప్‌లో సైబర్‌ నేరాలు, వాణిజ్య సంబంధాలు, ఆర్బిట్రేషన్‌పై చర్చ కొనసాగిందన్నారు. ఫ్యామిలీ, వ్యక్తిగత చట్టాల గురించి వచ్చే ఇబ్బందులపై తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న కాలంలో ఎన్‌.ఆర్‌.ఐ, సహజీవనం, సరోగసి, ఆడాప్షన్‌లపై వస్తున్న కేసుల గురించి వివరించారు. ఈ తరహా కేసులు మన దేశంలో కూడా అంతకంతకూ పెరుగుతున్నాయన్నారు. జువనైల్‌ యాక్ట్‌ 41కి సంబంధించి కేసులకు సంబంధించిన ఉన్న అవరోధాలను వివరించారు. చిన్నపిల్లల కేసులకు సంబంధించి, వాటిని పరిష్క రించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, రాష్ట్రాల మధ్య దత్తత విషయంలో కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సరోగసిపై ఉన్న చట్టాలను ప్రతిబంధకాలను వివరించారు. కోడిఫైడ్‌ లా తీసుకురావాల్సిన అవసరం ఉందని జస్టీస్‌ రోహిణి వివరించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌.వి.రవీంద్ర మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో కేసులు త్వరగా పరిష్కారం కావడానికి న్యాయవాదులు, న్యాయా ధికారులు తమవంతు కృషి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీట్రేషన్‌ యాక్టుకు సంబంధించి వివిధ సెక్షన్స్‌ను వివరించారు. భారతదేశం ఆర్బిట్రేషన్‌ హాబ్‌గా భవిష్యత్తులో ఏర్పాటైయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ర్ట ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు అమరావతి రాజధానిలో ప్రపంచ గుర్తింపు కలిగిన జస్టీస్‌ నగరం నిర్మా ణం అంకురార్పణ చేయడానికి కృషి చేస్తామని మొదటి రోజు వర్క్‌షాప్‌లో చెప్పిన విషయం తెలిసిందేనన్నారు. దానికి అనుగుణంగా కేసుల పరిష్కారంలో బార్‌ ఆసోసియేషన్‌ సహకారం అందించాలని కోరారు. విజయవాడ బార్‌ అసోషియేషన్‌ విశిష్టతను ఆయన కొనియాడారు.
దేశంలో గోలక్‌నాధ్‌, కేశవా నంద భారతీ కేసులకు సంబంధించి ఉన్న ఫండమెంటల్‌ రైట్స్‌పై వచ్చిన తీర్పు లను వివరించారు. అనంతరం రెండు రోజులపాటు నిర్వహించిన అంతరా ్జతీయ వర్క్‌షాపులో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌, జస్టిస్‌ జి. రోహిణిలను బెజవాడ బార్‌ ఆసోసియేషన్‌ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వాలం టీర్లను, రెండురోజుల పాటు వర్క్‌షాప్‌ నిర్వ హించిన జట్రో, ఇ.డి.బి సభ్యులను జస్టిస్‌ ఎన్‌.వి రమణ, మదన్‌ బి.లోకూర్‌లు శాలువాతో సత్కరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com