విజయవాడ, సూర్యబ్యూరో : మంగళగిరి (గుంటూరు జిల్లా) శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో మార్చి 3వ తేది నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రమ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలల నిర్వహణపై ఇటీవల ఆలయంలో సమన్వయ కమిటీ చర్చిం చింది. రెవెన్యూ, పోలీసు, వైద్య, విద్యుత్తు, పురపాలక, అగ్నిమాపకదళ తదితర శాఖల అధికారులు పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే రామకష్ణారెడ్డి, పురపాలకసంఘ చైర్మన్ గంజి చిరంజీవి, ఇ.వో. మండేపూడి పానకాలరావు ఆవిష్కరించారు. కమిషనర్ రంగారావు, విద్యుత్తు శాఖ ఏడీఈ రాజేష్ ఖన్నా, సి.ఐ.బ్రహ్మయ్య, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. వాహన సేవలు తదితర అంశాలతో కూడిన విధంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆ రోజున ఉదయం 8 గంటలకు పెండ్లి కుమారుడి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. 4న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ ఉత్సవం, 5న రాత్రి 8 గంటలకు హను మంత వాహన ఉత్సవంతో బ్రహ్మోత్సవాలో వాహన సేవలు ప్రారంభం కాను న్నాయి. 6న రాజాదిరాజ వాహనం, 7న యాలి వాహనం, 8న సింహవాహనం, 9న గజవాహనంపై శ్రీవారి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. 10వ తేది ఉదయం 9 గంటలకు కలాేవ క్షవాహనం, రాత్రి 8 గంటలకు పొన్నవాహన నిర్వహిస్తారు. 11న రాత్రి 12 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మినసింహస్వామి కల్యాణం జరుగుతుంది. 12వ తేది ఉదయం 6 గంటలకు బంగారు గరుడవాహనంపై కల్యాణమూర్తులు పురవీధుల్లో ఊరేగుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు రథోత్సవం ఉంటుందని కార్యనిర్వాహణాధికారి పానకాలరావు తెలిపారు. 13న వసంతోత్సవం, 14న పుష్పయాగం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.