న్యూఢిల్లి : ఇవిఎంలను, వివిపాట్లను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ చెప్పారు. వాటిని పరీక్షించి, ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసిన తరువాతే ఉపయోగిస్తున్నందున ఈ విషయంపై చర్చ అనవసరమని, దీనిని ఇక వదిలివేయాలని ఆయన అన్నారు. ఇవిఎంలు వేటికవే విడివిడిగా ఒక్కొక్క యంత్రం కావడం వల్ల దీనిని హ్యాక్ చేయడమనే సమస్యే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు.