ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు ఈ రోజు ఒకరికొకరు ఎదురుపడి ఆత్మీయంగాపలుకరించుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ ఎన్నికలప్రచార గడువు నిన్నటితో ముగిసింది. ఈ రోజు ఢిల్లీలో ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మన్మోహన్ పై పాకిస్థాన్ మాజీ ప్రతినిథితో రహస్య సమావేశంలో పాల్గొన్నారంటూ విమర్శించగా, మాజీప్రధానిమన్మోహన్ ఆ ఆరోపణలను ఖండించడమేకాకుండా మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 2001 లో పార్లమెంటుపై ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు నివాళి అర్పించే కార్యక్రమంలో ఇరువురూపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరుపలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.