ఏపీలో వచ్చే ఆరు నెలల్లో 6,500 చంద్రన్న మాల్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విద్యాధరపురంలో మంత్రి పుల్లారావు చంద్రన్న విలేజ్ మాల్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రన్న విలేజ్ మాల్స్ రిలయన్స్కు కట్టబెట్టామన్నది అవాస్తవమన్నారు. తక్కువ ధరకు వస్తువులు అమ్మేందుకే చంద్రన్న మాల్స్ ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్ రేటు కంటే కనీసం 20 శాతం తక్కువ ధరకు సరుకులు విక్రయించడం జరుగుతుందన్నారు.