ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ ఈ రోజు అమరావతిలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా గురించి కొందరు మళ్లీ ఆందోళనలు ప్రారంభిస్తోన్న విషయంపై స్పందించారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ ముట్టడి చేయాలనుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ ధర్నా చేసుకోవాలని, అసెంబ్లీని ముట్టడిస్తే ఏం లాభమని అన్నారు. హోదా కాదంటేనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని, ప్యాకేజీకి ఒప్పుకోకుంటే అనంతపురానికి కియా ఎలా వచ్చేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పనుల కింద 16 వేల కోట్ల నిధులు ఎలా వస్తాయని లోకేశ్ అడిగారు. హోదా, ప్యాకేజీలపై అవగాహన లేనివారు కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఏది రాలేదో చెప్పాలని నిలదీశారు.