ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలు రూపొందించిన చిత్తూరు జిల్లా యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 02:13 PM

ఎప్పటి నుంచో మెగా, నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ 'ఆర్ఆర్ఆర్' మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు RRR సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను ఆవిష్కరించాడు. దీని కోసం అతడు ఏకంగా 15వేల టీ కప్పులను ఉపయోగించాడు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చిన్నపర్తికుంటకు చెందిన పురుషోత్తం అనే యువకుడికి ఎప్పుడు వినూత్నంగా ఆలోచించడం అలవాటు. అందుకే చిన్నతనం నుంచే ఉప్పుతో బొమ్మలు వేసేవాడు. అయితే RRR సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మూవీలో నటించిన ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలను టీ కప్పులతో వేయాలని ఆలోచించాడు. దీంతో కష్టపడి ఆరు రోజులు శ్రమించి టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను రూపొందించి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని ఆర్ట్ వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com