చిత్తూరు: కుప్పం - పలమనేరు జాతీయ రహదారి శెట్టిపల్లి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో మంగళవారం ఉదయం బట్టల మూటులు చోరి అయిన ఘటన వెలుగు చూసింది. డ్రైవర్ లారీని ఆపి నిద్రపోతున్న సమయంలో సుమారు 5 లక్షల రూపాయల బట్టల మూటలను దొంగలు అపహరించుకుపోయారు. ఉదయం లేచి చూసేసరికి బట్టల మూటలు కనిపించకపోవడంతో గుడిపల్లె పోలీసులకు పిర్యాదు చేసినట్లు డ్రైవర్ రమేష్ తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.