ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు ఐన తర్వాత నూతనంగా ఎన్నో పధకాలను , స్కీం లను ప్రవేశపెట్టారు. వాటిలో రైతులకి సంభందించి పాల ఉత్పత్తి కేంద్రాలుగా అమూల్ కేంద్రాలు కూడా ఒకటి. ఐతే ఈ విధానాన్ని మొదటగా కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానిని విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే జగనన్న పాల వెల్లువ తొలుత 3 జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించింది. అమూల్ రాకతో పాల నాణ్యత విషయంలో పాడి రైతులకు అవగాహన పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. అని వైసీపీ పార్టీ అధికారికంగా తెలియపరిచింది.