ఉగాది ఉత్సవాలకు శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తుల సౌకర్యార్థం నీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆస్పరి సర్పంచ్ మూలింటి రాధమ్మ తెలిపారు. సోమవారం గ్రామ సమీపంలోని సుకాల నాగమ్మవ్వ ఆలయం దగ్గర రెండు కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు.
బళ్లారి, హోస్పేట్, బాదనహట్టి, కొలగల్లు, చెందాయల, సూగూరు, కొడితిని, కంప్లికొట్టాల తదితర గ్రామాల నుంచి ప్రతి రోజు వందలాది మంది భక్తులు ఆస్పరి మీదుగా వెళ్తారని, వారి కోసం వీటిని ఏర్పాటు చేశామన్నారు.