డోన్ మండలంలోని కామగానిగుంట్ల, తిమ్మాపురం గ్రామ రైతులు నకిలీ ఉల్లి విత్తనాలతో నష్టపోయారని, వారిని ఆదుకోవాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డికి, వ్యవసాయాధికారి అబ్దుల్ షఫికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రంగనాయుడు మాట్లాడుతూ డోన్ లో నకిలీ విత్తనాల వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన ఉల్లి రైతులకు ఎకరాకు రూ. లక్ష పరిహారం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు రాధాకృష్ణ, సుంకయ్య, పులిశేఖర్, ఓబులాపురం నారాయణ, శివన్న పాల్గొన్నారు.