తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 9 కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు ఉదయం 8 గంటల తర్వాత శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. నిన్న శ్రీవారిని 74,868 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 33,201 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 2.38 కోట్లు.