హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. జలాశయం ఇన్ఫ్లో 1,20,071 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 83,363 క్యూసెక్కులు ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.90 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటినిల్వ 205.59 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడుకు 6 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1,345 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 7 యూనిట్ల ద్వారా 106 మెగావాట్ల విద్యుత్ను, ఎడమగట్టు కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 150 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్కు 74,413 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు