మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో ఉన్న అహ్మద్ నగర్ డ్యామ్ కుప్పకూలిపోయింది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. డ్యామ్ కూలిపోవడంతో దాని పక్కనే ఉన్న అరంగావ్ గ్రామం పూర్తిగా మునిగిపోయింది. దీంతో ఆ గ్రామంలోని 50 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక చర్యలు ప్రారంభించారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తో ఆ గ్రామానికి వెళ్లి ఇప్పటికి 30 మందిని రక్షించారు. మిగితా వారి కోసం గాలిస్తున్నారు.