న్యూఢిల్లీ : దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ఉపవాస దీక్ష చేపట్టారు. ఇవాళ్టి నుంచి మోదీ తొమ్మిది రోజుల పాటు కేవలం వెచ్చని మంచినీటిని మాత్రమే తీసుకుంటారు. నవరాత్రుల సందర్భంగా మోదీ గత 40 ఏళ్లుగా ఉపవాస దీక్ష చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోదీ దుర్గా మాతను విశేషంగా పూజిస్తారు. ఉపవాసం ఉన్నా ప్రధాని మాత్రం షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈసారి నవరాత్రి సమయంలోనే మోదీ తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. 2014లో అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా మోదీ తన నవరాత్రి ఉపవాస దీక్షను కొనసాగించారు.