ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కరోజులో మారిపోయిన జీవితం.. లక్షాధికారిగా మారిన కూలీ

national |  Suryaa Desk  | Published : Sat, Nov 27, 2021, 12:34 PM

గనుల్లో పనిచేసే ఓ కూలీ జీవితం ఒక్కరోజులో మారిపోయింది. అతడిని వజ్రం రూపంలో అదృష్టం వరించింది. దీంతో ఆ కూలీ లక్షాధికారిగా మారిపోయాడు. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్‌ లోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శంశేర్‌ ఖాన్‌ అనే వ్యక్తి పన్నాలోని హీరాపుర్‌ తపరియన్‌ ప్రాంతం గనుల్లో పని చేస్తున్నాడు. అతడికి పనిచేస్తుండగా వజ్రం లభించింది. 6 క్యారెట్ల 66 సెంట్ల బరువున్న ఆ వజ్రం ధర రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ వజ్రాన్ని వేలం వేసేందుకు అతను దానిని ప్రభుత్వ అధికారులకు అప్పగించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com