కాన్పూర్ లో జరుగుతోన్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ నిలకడగా కొనసాగుతోంది. మూడో రోజు తొలి సెషన్ లో న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయింది. మూడో రోజు 129/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ని ఆరంభించిన న్యూజిలాండ్ లంచ్ బ్రేక్ సమయానికి 197 పరుగులు చేసింది. విల్ యంగ్ (89) ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయగా, విలియమ్సన్ (18)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. మరో ఓపెనర్ టామ్ లేథమ్ (82*) నిలకడగా ఆడుతున్నాడు. భారత బౌలర్లలో అశ్విన్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ తీశారు. వికెట్ల కోసం భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు.