తిరుపతి:ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్కు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. కేసీఆర్కు శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకనున్నారు. రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ తిరుమల చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. బుధవారం తెల్లవారుజామున శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పిస్తారు.