మహబూబ్నగర్: నటుడు ప్రకాశ్రాజ్ తన దత్తత గ్రామమైన మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో నేడు పర్యటించారు. పర్యటన సందర్భంగా స్థానికంగా ఉన్న పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లను ఆయన నేడు పరిశీలించారు. అనంతరం స్థానిక పీడీ, ఎమ్మార్వోలతో కలిసి తన ఫామ్హౌజ్లో మధ్యాహ్న భోజనం చేశారు. గ్రామంలో పూర్తిగా దెబ్బతిన్న పాఠశాల భవనాన్ని ప్రకాశ్రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ పాఠశాలలో గడిచిన జవనరి 26న విద్యార్థులతో కలిసి గణతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు.