గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం రెండు నెలల గరిష్ఠానికి చేరుకుంది. రూ.340 పెరిగి, పది గ్రాముల బంగారం రూ.29,890కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి భారీగా కొనుగోళ్లు వూపందుకోవడంతో పసిడి ధర పుంజుకున్నట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
పసిడి బాటలోనే వెండి పయనించింది. వెండి ధర కిలో రూ.40వేల మార్కును చేరుకుంది. రూ.570 పెరగడంతో కిలో వెండి రూ.40,070గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ రావడంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా 0.09శాతం పెరగడంతో ఔన్సు బంగారం ధర 1,278 డాలర్లు పలికింది.