అమరావతి: ఏపీలో నిన్న వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ మోహన్రెడ్డి స్పందించారు. వైకాపాకు ఘన విజయం అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి దీవెనలతోనే అఖండ విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం అన్నారు. తాజా విజయంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని జగన్ తెలిపారు.