గుంటూరు: నవ్యాధ్రలో జరిగే అతిపెద్ద తిరునాళ్ల కోటప్పకొండ వేడుక. మహాశివరాత్రి నాడు కోటప్పకొండలో తిరునాళ్లకు లక్షల్లో భక్తులు హాజరుకానున్నారు. దీనికి రాష్ట్రప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి తిరునాళ్లకు వచ్చే భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లతో సర్వసన్నద్ధమైంది. రాకపోకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన స్థాయిలో బస్సు సర్వీసుల ఏర్పాటుతోపాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఆ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.