ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూణేలో పట్టపగలే దారుణం

national |  Suryaa Desk  | Published : Tue, Jul 13, 2021, 12:11 PM

మహారాష్ట్రలోని పూణేలో క్షీరసాగర్, ఆకాష్ అనే వ్యక్తులు పక్కపక్కన ఇళ్లలో ఉంటారు. ఇటీవల ఓ రోజు కొంత మంది ఆకాష్ పై దాడి చేశారు. ఈ దాడికి కారణం క్షీరసాగర్ అని ఆకాష్ భావించాడు. ఆ తర్వాత ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఐతే క్షీరసాగర్ ను ఎలాగైనా చంపాలని ఆకాష్ ఫిక్సయ్యాడు. అది ఆదివారం మధ్యాహ్నాం పూణేలోని పింప్రీ-చింద్వాడ రోడ్డు చిఖాలీ ఏరియా. క్షీరసాగర్ మరో యువకునితో కలిసి మాట్లాడుతున్నాడు. వారితో పాటు క్షీరసాగర్ కుమారుడు కూడా ఉన్నాడు. ఇదే సమయంలో ఆకాష్ అక్కడికి చేరుకొని కత్తితో క్షీరసాగర్ పై దాడి చేశాడు. తేరుకున్న క్షీరసాగర్ పరుగులు పెట్టినా వదలకుండా వెళ్లి అతనిని హత్య చేశాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com