ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 02, 2021, 12:35 PM

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని నిమ్మకూరు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ కేవీ జగన్నాధరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


కృష్ణాజిల్లా నిమ్మకూరు (బాల, బాలికలకు), విజయనగరం జిల్లా తాటిపూడి(బాలికలు), గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ (బాలురు), నెల్లూరు జిల్లా వెంకటగిరి (బాలురు), గుంటూరు జిల్లా గుంటూరు (మైనార్టీ బాలురు) జూనియర్ కళాశాలలున్నాయని తెలిపారు.


లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నాగార్జునసాగర్ (బాలురు), కర్నూలు జిల్లా కర్నూలు (బాల, బాలికలు) ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2021-22 ఏడాదికి ప్రవేశం కోసం దరఖాస్తులు కోరుతున్నామని తెలిపారు.


లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను జూలై 15వ తేదీ లోపు హెచీటీపీఎస్// ఏపీఆర్ఎస్. ఏపీసీఎఫ్ఎస్ఎస్. ఐఎన్ ట్లో దరఖాస్తు చేయాలని తెలిపారు. వివరాలకు 7093323253, 9676404618, 9866559725 లో సంప్రదించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com