ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11 మంది అమర్‌నాథ్ యాత్రికులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 16, 2017, 03:06 PM

జమ్మూకశ్మీర్ : జమ్మూ - శ్రీనగర్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com