జమ్మూకశ్మీర్ : జమ్మూ - శ్రీనగర్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలో అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.