రేపు (మే 10) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.