భారత్ తనతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి కోసం కోవిడ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగివుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) పార్టనర్షిప్ 2020లో ఆమె మాట్లాడారు. ఆరోగ్య మౌలికసదుపాయాల్లో భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలోకి మరింత మంది ప్రైవేటు భాగస్వాములు ప్రవేశించాలని అభిలాష వ్యక్తం చేశారు. తద్వారా కోవిడ్ దెబ్బతిన్న గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి భారత్ దోహదప డనుందని ఆమె చెప్పారు. వైద్యరంగంలో పెట్టుబ డులు ఎంతో కీలకమైనవి. హాస్పిటల్స్ నిర్మాణ సామర్థ్యం, భవనాల సామర్థ్యాలు, టెలీమెడిసిన్ నిర్వహించగలిగే నైపుణ్యాలు, సున్నిత సామర్థ్యాలు అవసరమవుతాయని ఆమె పేర్కొన్నారు. మాన వతా దృక్పథంతో ఇతర దేశాలకు కూడా భారత్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగివున్నందుకు అదృష్టంగా భావించాలని ఆమె చెప్పారు.