ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త గజని, భార్యకు కోరికలు ఎక్కువ...

national |  Suryaa Desk  | Published : Fri, Nov 13, 2020, 10:27 AM

మొగుడు గజని టైపు, పైగా కొంచెం మెంటల్. ఎర్రగా, బుర్రగా, లావుగా, పొడవుగా ఉన్న భార్యకు కోరికలు ఎక్కువ. 14 ఏళ్లు భర్తతో కాపురం చేసిన భార్య అతని ప్రవర్తనతో విసిగిపోయింది. తన సంతోషాలకు భర్త పనికిరాడని డిసైడ్ అయిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తాను, తన పిల్లలు బతకడానికి రూ. 5 కోట్లతో పాటు చెన్నై, రాజస్థాన్ లోని ఆస్తులు భాగం పెట్టాలని భార్య కోర్టుకు వెళ్లింది. కోట్ల రూపాయల ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న భర్త, అతని తల్లిదండ్రులు కోడలికి ఆస్తులు ఇవ్వడానికి నిరాకరించారు. అంతే కొందరిని వెంట వేసుకుని భర్త ఇంట్లో కోడలు అడుగు పెట్టింది. మాటామాటా పెరిగిపోవడంతో భర్త, అత్తమామలను కుర్చీలో కట్టేసిన కోడలు రివాల్వర్ తీసుకుని ముగ్గురి నుదుటి మీద హాలీవుడ్ సినిమా టైపులో కాల్చి చంపేసింది.


రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ (74), ఆయన భార్య పుష్పాబాయ్ (70) దంపతులు 40 ఏళ్ల క్రితం చెన్నై చేరుకుని ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. దలీల్ చంద్ కు కుమారుడు సీతల్ (40), పింక్ (36) అనే కుమార్తె ఉన్నారు. దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ కలిసి చెన్నైలోని షావుకారు పేటలో ఫైనాన్స్ కంపనీ నిర్వహిస్తున్నారు. దలీల్ చంద్ కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారు. రాజస్థాన్ లో, చెన్నైలో దలీల్ చంద్, ఆయన కొడుకు సీతల్ కు కోట్ట రూపాయల ఆస్తులు ఉన్నాయి.


 


రాజస్థాన్ లోని బంధువులు ఎవ్వరూ తన కొడుకు సీతల్ కు పిల్లను ఇచ్చి పెళ్లి చెయ్యకపోవడంతో దలీల్ చంద్ మహారాష్ట్రలోని పూణేకి చెందిన జయమాల (36) అనే మహిళను చూసి పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. చూడటానికి ఎర్రగా, బుర్రగా, బలంగా ఉన్న జయమాలను పెళ్లి చేసుకుంటానని సీతల్ కూడా ఎగిరి గంతేయ్యడంతో వారి పెళ్లి 14 సంవత్సరాల క్రితం జరిగింది. సీతల్ ఆస్తులు, అంతస్తులు చూసి జయమాల కుటుంబ సభ్యులు అప్పుడు ఏం మాట్లాడకుండా పెళ్లి జరిపించేశారు. సీతల్, జయమాల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.


రెండు సంవత్సరాల నుంచి సీతల్, జయమాల దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త సీతల్ గజని కావడం, జయమాలకు కోరికలు ఎక్కువ ఉండటంతో దలీల్ చంద్, పుష్పాబాయ్ వారికి సర్దిచెప్పడం సాధ్యంకాక చేతులు ఎత్తేశారని తెలిసింది. భర్త సీతల్ తన కోరికలు తీర్చడానికి సరిపోడని డిసైడ్ అయిన జయమాల తన భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని పూణే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. తన భర్త సీతల్ తో విడాకులు తీసుకోవాలని జయమాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పూణేలోని పుట్టింటిలో ఉండిపోయింది. తాను తన పిల్లలు బతకడానికి రూ. 5 కోట్లు భరణం ఇవ్వాలని జయమాల కోర్టునుఆశ్రయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com