ఐపీఎల్ 13వ సీజన్ నేటినుంచి ప్రారంభం కానుంది. యూఏఈలోని అబుదాబీలో మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ తలపడనున్నాయి. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ వ్యక్తిగత రికార్డు ముందు నిలిచాడు. చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడానికి 42 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆ జట్టుపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు నమోదు చేశాడు. చెన్నైపై కోహ్లీ ఇప్పటివరకు 747 రన్స్ చేశాడు. అయితే ధోనీ సేనతో 27 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 705 పరుగులు చేశాడు. అంటే కోహ్లీకంటే 42 పరుగులు వెనకబడి ఉన్నాడు. 13వ సీజన్ ఆరంభ మ్యాచ్లో రోహిత్ జట్టు చెన్నైతోనే తలబడుతుండటంతో అతడు 43 పరుగులు చేసినట్లయితే ఆ జట్టుపై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి..!